మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఒకటో వార్డు కు చెందిన రాందాసు పెంటయ్య కు సీఎం సహాయనిధి నుండి మంజూరైన 42,500 విలువగలచెక్కును జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ మరియు జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి వలియాబీ సలీం ఆధ్వర్యంలో మంగళవారం రాందాసు పెంటయ్య ఇంటికి వెళ్లి ఇచ్చినట్లు మండల అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి ప్రజల కష్టసుఖాలను నేరుగా చూసిన తెలుసుకున్న గొప్ప దర్శనీకుడు అని ప్రజలు వివిధ కారణాల మూలంగా ఆస్పత్రి పాలైన ఆర్థికంగా కుంగిపోతున్న సందర్భాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రజలకు ఆర్థికంగా నష్టాలు కలగకుండా ఉండుటకు ముఖ్యమంత్రి సహాయ నిధి సెల్ ఏర్పాటు చేసిన గొప్ప పరిపాలకుడు అని అన్నారు. సంబంధిత వ్యక్తి అకౌంట్ బ్యాంకులో జమ అయ్యేలా చేసిన గొప్ప పరిపాలకులు అని ఆయన ప్రజల మన్ననలను పొందుతున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజలు రుణపడి ఉంటారని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏటూరునాగారం టిఆర్ఎస్ మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని సునీల్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు తుమ్మ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా, సీనియర్ నాయకులు రాంనర్సయ్య, ఎస్సీ సెల్ యూత్ మండల అధ్యక్షులు రాంబాబు, యూత్ మండల అధ్యక్షులు కొండాయి చిన్ని, మండల ఉపాధ్యక్షులు కొమిరి రమేష్, మండల ప్రచార కార్యదర్శి కుమ్మరి చంద్రబాబు, రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్ ధనపు నేని కిరణ్ కుమార్, మండలి మీడియా ఇంచార్జ్ భోజ రావు, అంగాల వీరన్న, తోట తిరుపతమ్మ, కొప్పుల కృష్ణ, ఆకుల నరసింహారావు, గుండారపు రమేష్ ,వలస రామయ్య, గంప జయ, ఆకుల రమేష్, అంబర్ కాని సాయి, గంగూరి పవన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: