గుండాల/ఆళ్ల పల్లి ( మన్యం టీవీ) తస్లీమా సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తస్లీమా సర్వర్ ములుగు జిల్లా లో సబ్ రిజిస్టర్ గా పని చేస్తున్నారు. ఉద్యోగం తో పాటు స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ పలువురిని ఆదుకుంటున్నారు. దానిలో భాగంగా ఆళ్ల పల్లి మండలంలోని మర్కోడు పంచాయతీ లో గల సంధి బంధం నడిగూడెం గ్రామాల్లో కరోనా బారిన పడిన వారికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు ములుగు జిల్లా తో పాటు కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో కరోనా బారిన పడిన వారికి నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. కరోనా బారిన పడి ఇంటి నుండి బయటికి రాలేక ఇబ్బంది పడే వారిని ఆదుకోవడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ములుగు ట్రస్ట్ సభ్యుడు సాయి తేజ్ , గుడిపాడు అధ్యక్షుడు అరెం ప్రశాంత్ , శివ శంకర ప్రసాద్ , ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: