CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కైసర్ పాషా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన వైఎస్ఆర్ సీపీ మండల అధ్యక్షులు కైసర్ పాషా ఇటీవల కరోనా తో మృతి చెందగా ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి10,000 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఇటీవల మండల కేంద్రంలో కరోనా తో మరణించిన గార రాములు కుటుంబాన్ని కూడా పరామర్శించి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే మండల కేంద్రానికి చెందిన అఫ్జల్ పాషా ఇటీవలే కరోనా తో మరణించగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. కరోనా తో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిట మట రఘు, కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, మంగపేట మండల అధ్యక్షుడు మైల జయరామ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, మాజీ ఎంపీపీ కోనేరు నగేష్, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, ఉప సర్పంచ్ కర్ల అరుణ, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీలు పెద్ద బోయిన నరసింహారావు, వావిలాల నరసింహారావు, కట్కూరి రాధిక, ముక్కెర లాలయ్య, ఎండి రియాజ్, ఎండి సులేమాన్, సప్పిడి రాము, హనుమంతు, ఎండీ గౌస్ వసంత శ్రీనివాస్, నరేందర్, ఎండి ముస్తఫా, లక్ష్మణ్, గద్దల నవీన్, సాంబశివరావు, గడ్డం మహేష్, ఎండి జిలాని, పెద్దిరాజు, బాలకృష్ణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: