👉గుండె పోటుతో మృతి
👉తెలంగాణ స్టేట్ కమిటీ సిపిఐ (మావోయిస్టు పార్టీ) అదికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ
మన్యం టీవీ, డెస్క్:
తెలంగాణ స్టేట్ కమిటీ సిపిఐ (మావోయిస్టు పార్టీ) అదికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల.లేఖలో మావోయిస్టు నేత కత్తి మోహన్ రావు, అలియాస్ ప్రకాశ్, ఉరఫ్ రామూ దాదా మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు.ప్రకాశ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మావోయిస్టు పార్టీ లో ముఖ్య పాత్ర పోషిశించినట్లు వెళ్ళడించారు.మావోయిస్టు మోహన్ రావు స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
మహబూబాబాద్ లో ఇంటర్, ఖమ్మంలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీ లో ఎమెస్సి చదివారు. గోల్డ్ మెడలిస్ట్.
1982 లో రాడికల్ విద్యార్థి విభాగంలో పని చేస్తూ ఉద్యమం వైపు మళ్లారు.39 ఏళ్లుగా సుధీర్ఘ కాలం ఉద్యమానికి సేవాలందిచారు.6 ఏళ్ళ జైలు జీవితం కూడా గడిపారు.కొన్నేళ్ళు టీచర్ గా విద్యార్థులకు విద్య బుద్ధులు అందించారు.జూన్10 వ తేదీన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.11 జూన్ రోజున అంతిమ సంస్కారాలు నిర్వహించి నట్లు లేఖ లో పేర్కొన్నారు.
Post A Comment: