CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరుపున రేగా కాంతారావు వితరణ

Share it:

 


విద్యుత్ షాక్‌కు గురైన గిరిజనుడు ఊకె కోటేశ్వరరావు కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం

 

మన్యం మనుగడ, పినపాక :


మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతు వూకే కోటేష్‌కు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున తెలంగాణా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రూ. లక్ష రూపాయల చెక్కును అందించారు. సోమవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును గిరిజన రైతు ఊకె కోటేష్‌కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద అయిన ఊకె కోటేష్‌ గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అనారోగ్య సమస్యతో భాదపడుతూ వ్యవసాయం చేసుకుంటున్న కోటేష్‌ పరిస్తితి తెలుసుకున్న తెలంగాణా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రైతు కుటుంబానికి రూ. లక్ష రూపాయలు ఆర్దిక సహాయం అందించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రవివర్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్‌ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, పినపాక ఎంపీటీసీ సిహెచ్‌ సత్యం, ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు,కటకం గణేష్‌, పొనుగోటి కామేశ్వరరావు, రవీందర్‌రెడ్డి, యాంపాటి సందీప్‌రెడ్డి, తోలెం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: