CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అబ్బుగూడెం గ్రామంలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల వైద్య శిబిరం

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి- ప్రియాంక ఆధ్వర్యంలో మండలంలోని అబ్బుగూడెం గ్రామంలో, కరోనా నిర్ధారణ పరీక్షలైనటువంటి ఆర్ఏటి (రాపిడ్ యాంటిజెన్ టెస్ట్) మొబైల్ టెస్టుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరం నందు 60 మంది గ్రామస్తులకు టెస్టులు చేయగా, ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వైద్య సిబ్బంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఐసోలేషన్ కిట్లు అందజేసి,వాటిని వాడే విధానం గురించి వివరించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ప్రియాంక. గ్రామస్తులతో మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభ అయినందున, అందరూ పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ,ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని.అప్పుడే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, డయేరియా,వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, ముఖ్యంగా కరోనా  జాగ్రత్తలను మరువ వద్దని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ-పోలేబోయిన కృష్ణయ్య, హెచ్వి- శారా రాణి, హెచ్ఏ-లక్ష్మి, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి-శాంతి గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: