CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అకస్మాత్తుగా జంపన్న వాగు వద్ద వాహనాల తనిఖీలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారo

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్న వాగు వద్ద స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి  ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మాస్కు ధరించి ఇద్దరి వ్యక్తులకు జరిమానా విధించిన ఎస్ఐ, మోటార్ వాహన చట్టం ప్రకారం సరైన పత్రాలు లేని 21 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు, లేనిచో వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

పశువుల యజమానులు నిర్లక్ష్యం వీడాలి

ఏటూరు నాగారం మండల కేంద్రంలో పశువులు యజమానులు నిర్లక్ష్యం వీడాలని స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో రోడ్లపై రాత్రివేళలో పశువులను విడిచిపెట్టడం తో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. యజమానుల నిర్లక్ష్యం వలన ప్రమాదాలు జరిగితే వారిపై ఆ గ్రామ పంచాయతీల సహకారంతో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపై గుంపులుగా పశువులు ఉన్నట్లయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: