*ఘనంగా రాష్ట్ర 8 వ అవతరణ దినోత్సవం*
మన్యం టీవీ కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర 8 వ అవతరణ దినోత్సవాన్ని జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా గ్రంథాలయంలో జాతీయ జెండాను గ్రంధాలయ జిల్లా చైర్మెన్, తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ కారుడు దిండిగాల రాజేందర్ ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని ఇప్పుడు స్వరాష్ట్ర ఫలాలు తెలంగాణ ప్రజానీకానికి అందుతున్నాయని అన్నారు.
ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలను కెసిఆర్ ప్రజలకు అందిస్తున్నారని. దేశం యావత్తు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని అన్నారు. స్వరాష్ట్ర ఉద్యమ సాధనలో ఎందరో యువ కిశోరాలు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వారి త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కార్యదర్శి వి అర్జున్, గ్రంథ పాలకురాలు మణి మృదుల, గ్రంథాలయసిబ్బంది నవీన్, రుక్మిణి, శైలజ ,పాఠకులు జయరామ్ ,కోటేశ్వరరావు, నజీమ్ ఇతరులు పాల్గొన్నారు
Post A Comment: