మన్యం టీవీ కొత్తగూడెం:-
జూన్ 26 శనివారం నాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం 14వ నెంబర్ వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో బ్రిడ్జి మీదినుంచి దూకడం జరిగింది. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని 108కు ఫోన్ చేయడం జరిగింది. అతను ప్రాణాలతో విలవిల లాడుతూ ఉండడాన్ని గమనించి చైర్ పర్సన్ వారి డ్రైవర్ మొగరం నాగరాజు మరియు సంఘటనా స్థలంలో ఉన్న మరొక వ్యక్తి కలిసి అతనిని నీళ్ళలో నుండి పక్కకు తీయడం జరిగింది. అది చూసి పలువురు టయానికి వచ్చి వారి ప్రాణాలను కాపాడారు అంటూ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి నీ పలువురు ప్రశంసించడం జరిగింది . అనంతరం పోలీస్ వారు సంఘటన స్థలానికి చేరుకొని తర్వాత ఆంబులెన్స్ లో అతనిని స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ కు తరలించడం జరిగింది.
Post A Comment: