*మణుగూరు ఏ ఎస్ పి శబరీష్*మన్యం టీవీ, అశ్వాపురం:
వర్షాకాలంలో వలస ఆదివాసీలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వచ్ఛమైన మంచినీరు తాగాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్ పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశామని మణుగూరు ఏ ఎస్ పి శబరీష్ అన్నారు. అశ్వాపురం మండలం లోని వలస ఆదివాసీ గ్రామాలైన గుట్ట బోరు , గుండ్ల మడుగు సంతోష్ గుంపు గ్రామాలకు చెందిన 78 కుటుంబాలకు గొందిగూడెం లో మంగళవారం అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పి శబరీష్ చేతుల మీదుగా వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ ఎస్పీ మాట్లాడుతూ *ఆదివాసీలు మావోయిస్టులు పట్ల ఆకర్షితులు కావద్దని వారికి సహకరించవద్దనికోరారు. *మావోయిస్టులలో చేరినవారు అనారోగ్యాలకు గురి అయి ఉంటే వారు పోలీసులకు సరెండర్* *అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు*
గుత్తి కోయ గ్రామాల అభివృద్ధికి గిరిజనులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మా వంతు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో లో సి ఐ సట్ల రాజు, ఎస్ఐ రాజేష్ సర్పంచులు పాయం భద్రమ్మ, పర్సిక సూరిబాబు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: