CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం

Share it:

 


  

టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి

 గుండాల    ( మన్యం టీవీ) పేదలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోకాళ్ళ వీరస్వామి అన్నారు.   ముతపురం గ్రామంలో ఆర్ ఐ  టీ జోగయ్య తో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వీరస్వామి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.  కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఆడపిల్లల పెండ్లికి  ముఖ్యమంత్రి కెసిఆర్  బాసటగా నిలుస్తున్నారు అని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం  వచ్చిన నాటి నుండి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి ప్రజలకు బాసటగా నిలుస్తుందన్నారు. మరో 20 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని కెసిఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోకాళ్ళ  శంకర్ , వి ఆర్ ఓ  గజేంద్ర రావు , తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: