CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కార్మికుల ఆధ్వర్యంలో నిరుపేద వికలాంగుని కుటుంబానికి క్వింటా బియ్యం నిత్యావసర వస్తువుల పంపిణీ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి నిర్వాసిత మల్లేపల్లి గ్రామస్తులు ఎగ్గడి నరసింహారావు,అనసూయ దంపతులు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.ప్రస్తుతం బండారుగూడెం లోని ఆదర్శ నగర్ లో కిరాయి ఇంట్లో నివాసముంటున్నారు.వారి కుమారుడు యగ్గడి సతీష్ వికలాంగుడు వారి కష్టాలను పాత్రికేయ మిత్రులు ద్వారా తెలుసుకున్న  ఓసి 2 రిలే- సి 60 టన్నుల డంపర్ లు నడిపే జూనియర్ ఆపరేటర్లు ఆదివారం ఉదయం క్వింటా బియ్యం నిత్యవసర వస్తువులను సేవా సమితి సభ్యులు ద్వారా వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సింగరేణి సేవ సమితి సభ్యులు నాసర్ పాషా మాట్లాడుతూ కరోనా  ఫస్ట్ వేవ్.లాక్ డౌన్ సందర్భంగా సింగరేణి కార్మికులు,అధికారులు, సూపర్వైజర్ల సహకారంతో మణుగూరు సమీప గ్రామాల లో పనులు లేక,ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న  కుటుంబాలకు,వృద్ధాశ్రమానికి,నిర్వాసిత కుటుంబాలకు సుమారు వంద క్వింటాళ్ల బియ్యాన్ని,నిత్యావసర వస్తువులను వితరణ అందజేశారనీ,సెకండ్ వేవ్ సందర్భంగా కూడా ఇప్పటికే దాతల సహకారంతో 30 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని, నిత్యవసర వస్తువులను సింగరేణి సేవా సమితి వారధిగా మా శక్తి మేరకు సహకారం అందిస్తున్నామనీ ఈ సందర్భంగా దాతలకు వారు ధన్యవాదాలు తెలిపారు.సేవా కార్యక్రమాల కు బియ్యాన్ని మంచి ధరకు అందిస్తున్న బియ్యం వ్యాపారి మోహన్ రావు కి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దాతలు భూక్య అంజయ్య,తిరుమల్, లక్ష్మీనారాయణ,ఎం.రవి, నాగార్జున,తిరుపతి, రామారావు,హరికృష్ణ,స్వామి,రఘుపతి,సత్యనారాయణ,శ్రీనివాస్,తాజుద్దీన్,ఎండి  షా,దేవేందర్,డీ.రమేష్,ఆర్. రమేష్,సింగరేణి సేవా సమితి సభ్యులు మంగీలాల్,శివ,బియ్యం వ్యాపారి మోహన్ రావు, గ్రామస్తులు తమ్మిషెట్టీ.నాని, లావణ్య,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: