గుండాల (మన్యం టీవీ) స్నేహితుల కుటుంబాలకు చేయూతను అందించారు పూర్వ విద్యార్థులు. తమతో పాటు పదో తరగతిలో కలిసి చదువుకున్న మిత్రులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయంగా ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. తమతో పాటు చదువుకున్న మిత్రులు భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. తూరు బాకా గ్రామానికి చెందిన జొగ నరసయ్య కరోనాతో చనిపోయాడు ఆయన కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మండల కేంద్రానికి చెందిన వూకె రమణ భర్త కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ ఇరువురి కుటుంబాలను సహచర మిత్రులు ఆర్థిక సహాయాన్ని అందించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతరం వాంకుడోత్ అజయ్ మాట్లాడుతూ అన్ని బంధాల కన్నా స్నేహబంధం గొప్ప దన్నారు. తల్లిదండ్రులను మరియు అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను దేవుడు నిర్ణయిస్తారని ఒక్క స్నేహితులను మాత్రం మనమే నిర్ణయించుకుంటే మన్నారు. ఆపదలో ఉన్న సమయంలో బంధువులు కూడా వస్తారో రారో కానీ స్నేహితుడు మాత్రం వెన్నంటె ఉంటారన్నారు . అలాంటి సహచర మిత్రులు భౌతికంగా దూరమైనప్పటికీ మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారన్నారు. మిత్రుల కుటుంబాలకు తమ వంతు బాధ్యతగా ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నాం అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో తాడిశెట్టి రాంబాబు , వీసం రాజశేఖర్ , పార్వతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: