రూ.1200 కోట్ల రూపాయలు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేసిన దళిత సంఘాలు, నాయకులు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని అంబేద్కర్ సెంటర్ లో దళిత సాధికారత పథకానికి రూ. 1200 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ గా వెళ్లి,అంబేద్కర్ సెంటర్ లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ దళిత సాధికారత పథకానికి నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, దళితులు అణచివేతకు గురవుతున్న సమయంలో అఖిలపక్ష పార్టీల సహకారంతో సమావేశం నిర్వహించి,దళిత సాధికారత కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయించటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు,సంఘాల నాయకులు,ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.సీఎం కేసీఆర్ దళితులకు చేస్తున్న సహాయాన్ని జాతి ఎన్నటికీ మరచిపోదని విప్ రేగా కాంతారావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో సాకారం అయిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,జిల్లా ఎంపీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,పార్టీ నాయకులు,యువజన నాయకులు,దళిత సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: