CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిణి-శిరీష

Share it:

 


మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారిణి- శిరీష. అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి,కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి డాక్టర్ ప్రియాంక ను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తపరిచారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న, ఆశా కార్యకర్తలకు పిపిఈ కిట్స్ అందజేసి, వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.మద్దుకూరు గ్రామంలో నిర్వహించిన మొబైల్ రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ సెంటర్ను సందర్శించి, కేసులు అధికంగా గల గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాలోనే టెస్ట్లు చేయవలసిందిగా చెప్పారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఐసోలేషన్ సెంటర్ మరియు కంటోన్మెంట్ జోన్గా ప్రకటించిన భీమునీగూడెం గ్రామపంచాయతీ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మద్దుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్-పద్దం వినోద్, హెచ్ఈఓ పోలెబోయిన కృష్ణయ్య, పిహెచ్ఎన్-పుల్లమ్మ, పిహెచ్ఎస్ఎన్-నాగమణి, ఏఎన్ఎం-సుశీల, పంచాయతీ సెక్రెటరీ- కృష్ణకుమారి,ఆశాలు తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: