CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూరునాగారం మండలంలోని చిన్న బోయినపల్లి పెట్రోల్ బంకు దగ్గర ఏఐసిసి మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు  నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క  ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి సూచన మేరకు పెరిగిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని పెట్రోల్ బంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన  కార్యక్రమం మండల అధ్యక్షుడు చిటమట రఘు  ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్షవడ్ల వెంకన్న హాజరై.మాట్లాడుతూ ఐదు నెలల కాలంలో నలభై మూడు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై అధిక భారం మోపాలని అదేవిధంగా గడిచిన 13 నెలలుగా పెట్రోల్ ధరలు 27 రూపాయల 70 పైసలు డీజిల్ కు 25 రూపాయల 90 పైసలు అలాగే గ్యాస్ కు వెయ్యి వెయ్యి రూపాయలకు పెంచారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అధిక భారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరుగుతుంటే రాష్ట్రంలో నిత్యావసర ధరలు భారీగా పెంచి అమ్ముతున్నారని దీనికి మాఫియా తయారయిందని పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువులు తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర దమ్ము లేదని అన్నారు. కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజల జీవన విధానం పై ప్రభావం చూపుతుందని కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ పేరుతో నిత్యవసర వస్తువులను కొంతమంది మాఫియా నిల్వచేసుకొని మార్కెట్ను రాకుండా చేసి ఎక్కువ ధరలు పెంచి అమ్ముతున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. అదేవిధంగా కరోనా తో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. తల్లిదండ్రులు చనిపోయి అనాధగా ఉన్న పిల్లలను ప్రభుత్వమే విద్యా చెప్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ  కష్టకాలంలో ఒకపక్క కరెంట్ బిల్లులు ఎక్కువ మోపి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ మూడు నెలల కరెంట్ బిల్లు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు చెన్నూరు బాలరాజు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షులు రియాజ్ జియా, సింగిరెడ్డి శ్రీరాములు, సొసైటీ డైరెక్టర్ వంగపండ్ల రవి, మండల కార్యదర్శి బాసాని విద్యాసాగర్, సీతక్క యువసేన మండల అధ్యక్షులు ఎండి గౌస్,యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్,వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్,గార మహేష్,గార ప్రశాంత్, మండల అధికారప్రతినిది, మీడియా ఇంచార్జి ఎండి జిలాని,ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: