మన్యం టీవి:ములకలపల్లి మండలం: ఏఐసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని,ములకలపల్లి మండల కేంద్రం లోని గలా పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలియజేసారు.అనేక సార్లు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబంధులు ఎదుర్కుంటున్నారని కావున వెంటనే ధరలు తగ్గించాలని ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు పై నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెటేటి నరసింహరావు,అశ్వారావుపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారావు,కొప్పుల రాంబాబు,బుగ్గరాపు సత్యనారాయణ, యస్ సి కన్వీనర్ పాలకుర్తి రవి, షేక్ ఖాదర్ బాబా, ఎండీ అంజుమ్, అనంత్తుల సత్యనారాయణ, బానోతు అమర్ సింగ్,బానోతు బాలాజీ, మడకం శ్రీను, ఇసంపల్లి వెంకటేశ్వర్లు,వనమా వెంకటేశ్వరావు సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: