మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని మామిడి గుండాల, రొంపేడు గ్రామపంచాయతీ లలో కరోనా పాజిటివ్ బాధితులకు సోమవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు పండ్లు, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, పాపారావు, వెంకట్, సురేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: