CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పచ్చిరొట్ట విత్తనాలతో రైతులు అధిక దిగుబడి పొందండి.

Share it:

 


• సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు.


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.


పచ్చి రొట్ట విత్తనాలతో రైతులు అధిక దిగుబడులు పొందాలని గానుగుపాడు సహకార సంఘం సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు రైతులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం గానుగుపాడు సొసైటీకి జిలుగు విత్తనాలు 15 టన్నులు పిల్లి పెసర 20 టన్నులు రైతులకు అందుబాటులో ఉన్నాయని. పిల్లి పెసర బస్తా 576 రూపాయలు కాగా జిలుగులు బస్తా 561 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు. విత్తనాలు పొందడానికి రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ లు. అలాగే వ్యవసాయశాఖ అధికారి జారీ చేసిన టోకెన్ తీసుకొని విత్తనాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు పసుపులేటి వెంకటేశ్వర్లు, ఉన్న నాగరాజు, రాజబోయిన నాగేశ్వరరావు, రామిశెట్టి సరళ, తీట్ల మార్తమ్మ, రైతులు చెవుల ఆదెయ్య, ఎస్కె అబ్బాస్ అలీ, కే వెంకటేశ్వర్లు, తీట్ల భాస్కరరావు, సీఈఓ లంకా నరసింహారావు, స్టాపు సిహెచ్ నాగబాబు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: