CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు లను నమోదు చేస్తాం

Share it:


  •  

*జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఐపీఎస్.

మన్యం టీవీ ములుగు

తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ములుగు జిల్లా పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిపి నకిలీ విత్తనాలు అమ్మే వారిని పట్టుకోవడానికి ఉమ్మడి టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాలు పురుగు మందులు, మరియు ఎరువులు, అమ్మే వారి పై సరఫరా చేసే వారిపై మరియు నకిలీ విత్తనాలు కలిగి ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. రైతులు అధికారిక విత్తన కంపెనీ ప్రతినిధులు మరియు సామాన్య ప్రజలు ఎవరికైనా జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించవలసిందిగా కోరారు. రైతులను మోసం చేస్తూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వ్యక్తుల పై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇట్టి కార్యకలాపాలకు పాలు పడే నేరస్తుల పై పీడీ యాక్ట్ లను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్ జిల్లా ఎస్పీ తో కలిసి పై విషయంపై చర్చించారు. అనంతరం ఏఎస్పి రూపేష్ ఐపీఎస్ ను ఈ టాస్క్ఫోర్స్ టీంకి నోడల్ ఆఫీసర్ గా ఉంటారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పి సాయి చైతన్య ఐపీఎస్, ఏటూరు నాగారం ఏఎస్పి గౌస్ ఆలం ఐపీఎస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రెహమాన్ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: