మితిమీరిన ధన దాహంతో అమాయకులను టార్గెట్ చేస్తూ లక్షలు గడిస్తూ... అధికారులను సైతం లంచాల బాటలో నడిపిస్తున్నారా..?
చమటోడ్చి సంపాదించిన సొమ్మును కొందరు రాజకీయ నాయకుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కాజేస్తున్నారన్నది నిజమేనా..?
మన్యం టీవీ పాల్వంచ :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ లోని వనమాకాలని నందు గల రెవెన్యూ మరియు ఫారెస్ట్ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయి.అక్కడ కొంతమంది కబ్జా దారులు ఒకరికొకరు సహకరించుకుంటూ అమాయకులకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.గుట్ట పై భాగం వరకు ఇల్లులు రాత్రికి రాత్రే కట్టుబడి చేస్తున్నారు. ఇలాంటి స్థలాలు పూర్తిగా రెవిన్యూ మరియు ఫారెస్ట్ పరిధిలోనివి కానీ కొందరి బడాబాబుల పేరు చెప్పుకుంటూ సాదా బైనామా పత్రాలను చూపిస్తూ కట్టడాలు చేస్తున్నారు. అక్కడ ఎవరికీ.. అమ్మే హక్కు కొనుగోలు చేసే హక్కు లేదు అమాయకుల సొమ్ము ఆగం చేస్తూ కల్లబొల్లి కబుర్లు చెప్పి కట్టడాలు చేపిస్తున్న వారి పై చర్యలు తీసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అధికారులకు వివరిస్తున్నాం.
Post A Comment: