CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ఎంపిపి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

Share it:

 



 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటి చండ్రుగొండ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గా పనిచేసిన మాజీ ఎంపీపీ బాలు నాయక్ కుటుంబాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహమ్మారి కరోనా వైరస్ వల్ల ఎంతో మంది మంచి మనుషులను కోల్పోవడం జరిగిందన్నారు. అందులో మాజీ ఎంపీపీ గుగులోత్ బాలునాయక్ మృతి చెందటం నాకు ఎంతో బాధ కలిగించిందన్నారు. వారి కుటుంబానికి పార్టీ తరఫున వ్యక్తిగతంగా ఎల్లవేళలా అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని బాలు నాయక్  కుమారులు గుగులోత్ హరి ప్రకాష్ నాయక్, గుగులోత్ ప్రవీణ్ ప్రకాష్ నాయక్  కు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు పార్వతి, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, జెడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి,  ఎంపీటీసీలు దారా బాబు, లంక విజయలక్ష్మి, భుక్య రాజి, సంగొండి వెంకట కుమారి, సర్పంచు బానోత్ కుమారి, మాలోత్ బోజ్యా  నాయక్, మేడా మోహన్ రావు, బాబురావు, సురా వెంకటేశ్వర్లు, బీలు, ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: