CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా 100% సబ్సిడీపై కంది విత్తన ప్యాకెట్లు పంపిణీ...

Share it:

 





మన్యం టీవీ జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం రైతు వేదిక నందు శనివారం క్లస్టర్ పరిధిలోని రైతులకు  జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద 100% సబ్సిడీ పై కంది విత్తనాలను మండల వ్యవసాయ అధికారి S రఘు దీపిక అందజేశారు. ఏవో రఘు దీపిక మాట్లాడుతూ.. కంది పంట ను పత్తి లో అంతర పంట గా సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని తెలిపారు. కావున రైతులు పత్తి పంట లో కంది ని సాగు చేసి మంచి లాభాలను పొందాలని సుచించారు. అలాగే రైతులు  తాము సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి కి తెలియజేసి నమోదు చేయించుకోవాలని తెలిపారు . రైతు బంధు డబ్బులు అందరికీ జమ చేయబడుతున్నాయని తెలిపారు. రైతు బంధు పథకం పై ఏవైన సమస్యలు ఉంటే తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారి బి. గోపి కృష్ణ, గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, ఎంపీటీసీ కాజా విజయరాణి, పంచాయతీ పాలక సభ్యులు కాజా రమేష్, హరీష్, నర్సాపురం రైతుబంధు సమితి గ్రామకో ఆర్డినేటర్ నాగరాజు, కరివారిగుడెం రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ బి. భీమరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: