మన్యం టీవీ చర్ల :
చర్ల మండలం ప్రాథమిక వైద్యశాలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అభివృద్ధి పరచాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొండా చరణ్ మరియు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సెక్రెటరీ మచ్చా రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి చర్ల మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొండ చరణ్ మాట్లాడుతూ
మండలంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వలన చాలామంది అనారోగ్యానికి గురై ఇక్కడి నుండి కార్పొరేట్ వైద్యశాలకు తరలించి లక్షలు వెచ్చించి వైద్యం చేయించినా ఆత్మీయులను బ్రతికించ లేని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ప్రతి మండల కేంద్రంలో అధునాతనమైన వంద పడకల వైద్యశాలను వెంటనే నిర్మించి ప్రజలకు అందుబాటులో ఖరీదైన వైద్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Post A Comment: