మన్యం టీవీ వాజేడు. వానాకాలం 2021 సీజన్ మొదలయినందున ఈ రోజు వెంకటాపురం మరియు వాజేడు మండలాల్లో విత్తన దుకాణాలలో వ్యవసాయ శాఖ మరియు టాస్క్ ఫోర్స్ టీంలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
షాపులలో విత్తన నిల్వలు తనిఖీ చేసి బిల్లులు మరియు స్టాక్ పుస్తకాలు తనిఖీ చేయడం జరిగింది
రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మాలని డీలర్ లకు తెలపడం జరిగింది.
అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే విధిగా రైతులకు బిల్లులు ఇచ్చి అమ్మకాలు చేయాలనీ సూచించడం జరిగింది.
రైతులు పక్క జిల్లాల నుండి కానీ,ఇతర రాష్ట్రాలనుండి కానీ విత్తనాలు కొనుగొలు చఈయరాదని సూచించడం జరిగింది.
అలాగే రైతులు కూడా తప్పనిసరిగా అధీకృత డీలర్ వద్దనే బిల్లుతోవిత్తనాలు కొనాలి మరియు బిల్ పంట కాలం పూర్తయ్యేవరకు దాచు కోవాలి అని తెలిపారు.
అలాగే డీలర్ లు కలుపునివారిని గ్లై పో సెట్ ను అమ్మరాదని ,ప్రభుత్వం అట్టి అమ్మకాల ఫై పరిమితులను విధించిందని తెలిపారు.
ఈ కలుపు మందు పంటలపై వాడకం నిషేదించడం
జరిగిందని, కేవలం ఖాలీ క్షేత్రాలలొ మాత్రమే వాడాలన ప్రభుత్వం నిర్దేశీంచిందనిి అట్టి అమ్మకాలు కూడా ఏ డి ఏ మరియు ఎం ఏ ఓ ల సిఫారసు మేరకే అమ్మాలని పేర్కొనడం జరిగింది.
ఈ తనిఖీలలో ఏ డి యన్ యన్.శ్రీధర్, సీ.ఐ.సంజీవ్ రావు,ఏ.ఓ. వాజిద్,యస్ ఐ . రాజు. ఏ ఈ ఓ సుకుమార్,మరియు టాస్క్ఫోర్స్ పోలీస్ పాల్గొన్నారు.
Post A Comment: