CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపిపి గుమ్మడి గాంధీ

Share it:

 



మన్యం మనుగడ ,పినపాక:


 తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ వేడుకలను పినపాక మండలం లో ఘనంగా నిర్వహించారు. పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మండల వనరుల కేంద్రం, పినపాక మండల పరిషత్ కార్యాలయాలలో ముఖ్య హోదాలో ఉండి జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే బంగారు తెలంగాణ అని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణలో పరిపాలన సుభిక్షంగా ఉందని,ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, తాహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్ ,పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కొండేరు రాము, టిఆర్ఎస్ నాయకులు దాట్ల వాసు బాబు, బొలిశెట్టి నరసింహారావు, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: