గుండాల జూన్ 27 (మన్యం టీవీ) గుండాల తండాకు చెందిన డ్రైవర్ ధరమ్ సోత్ రవి 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అతని కుటుంబాన్ని ఆదుకోవాలన్న దూడ సంకల్పంతో రవి మిత్ర బృందం మొత్తం దాతల ద్వారా 38 వేల ఏడు వందల రూపాయల ను సేకరించారు అందులో ఎనిమిది వేల రూపాయలు దహన సంస్కారాలకు ఖర్చు మిగతా డబ్బులను రవి కుమారుడి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా కుటుంబ సభ్యులకు వివరించి డబ్బులను వారికి అందజేశారు. అనంతరం రవి మిత్రులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయానికి తోడ్పడిన దాతలకు కృతజ్ఞతలు అన్నారు. తమ వంతు బాధ్యతగా ఈ డబ్బులను దాతల ద్వారా సేకరించి వారికి అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంగీలాల్, వీరన్న, జాటోత్ గణేష్ , జబ్బర్ లాల్ , వీరన్న ,నరేష్ , కిరణ్ , నవీన్ , నరేందర్ , నరేష్ ,మహేష్ ,వెంకన్న ,శ్రీను ,కృష్ణ ,మంగీలాల్ ,సురేష్ ,సతీష్ ,నవీన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: