💥మానవసేవే మాధవసేవ: శ్రీరామమూర్తి
మన్యం మనుగడ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలంలోనీ బచ్చువరిగుడెం, కొత్తూరు గుమ్మడివల్లి, కోయారంగ పురం,నంధిపాడు గ్రామ పంచాయతీలలో కరోనా వచ్చి హోం ఐసోలేషన్ లో వున్న వారికి అలాగే పంచాయితీ పారిశుధ్య కార్మికుల కి, ఆశ వర్కర్లకి నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే గఆదేశానుసారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ కరోనా వచ్ఛిన వారికి ధైర్యం చెప్పి ఈ కరోనా మహమ్మారి త్వరగా పోవాలని అందరు సంతోషంగా వుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అని ఆయన తెలిపారు. అలాగే కరోనా వచ్చి హోమ్ క్వరంటిన్ లో ఉన్న వారిని ఎమ్మెల్యే మేచ్చ నాగేశ్వరావు ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మీ,సర్పంచ్ లు గంగా భవాని, కొడిమి సీత, వీరాస్వామి,ఎంపీటీసీలు తిరుపతి రావు నియోజక వర్గ నాయకులు పుట్టా సత్యం, చెన్న రెడ్డి గ్రామ పార్టి ముఖ్య నాయకులు,ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీ లు, ఆశ వర్కర్లు, పంచాయితీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: