మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం క్రాస్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు టిపిసిసి గా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పోదెంవీరయ్యని నియమించిన సందర్బంగా ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కి, రాహుల్ గాంధీ కి ధన్యవాదములు తెలుపుతూ, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, బయ్యారం ఎక్స్ రోడ్ నందు భాణా సంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించినారు.ఈ బయ్యారం ఎక్స్ రోడ్ నుండి తొగ్గూడెం గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ రాజీవ్ గాంధీ , రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి భాణా సంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: