CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిడుగుపడి ఇద్దరు వ్యక్తుల మృతి

Share it:

 


👉వర్షం రాకతో చెట్టు కింద నిలబడిన 8మంది వ్యక్తులు

👉పిడుగుపాటుకు మృ తి

👉ప్రగళ్లపల్లి లో విషాదఛాయలు

👉వర్షం కూరేసేటప్పుడు చెట్టుకింద నిలబడకూడదు:మన్యం టీవీ

మాన్యం టివి దుమ్ముగూడెం: రెక్కాడితే డాక్కాడని బ్రతుకులు వారివి. రోజువారి లానే బుధవారం పశువులను మేతకు తొలుకవెళ్ళారు. అదే వారికి చివరి రోజు అవుతుందని అనుకోకోలేదు. మాయదారి వర్షం పిడుగు రూపంలో వారి ప్రాణాలనుబలికొన్నది. కుటుంబాల ఇంటి పెద్దల మృతి తో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ప్రగలపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ కాలనీ లో గ్రామంలో  మెరుపులుతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో  గ్రామానికి చెందిన జుంజురి భాస్కర్ రావు వయసు (50), చాట్ల వీర్రాజు వయసు (56),గేదెలు కాసుకుంటు  వర్షంకురుస్తుండడంతో వీరితో పాటు మరో 8 మంది వ్యక్తులు చెట్టుకిందకు చేరుకున్నారు. ఈ క్రమంలో  వారు పిడుగు పాటుకు గురైనారు.వారిని  హుటాహుటిన దగ్గర లో ఉన్న ప్రాధమిక  హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగా అప్పటికే ఇద్దరు  మృతి చెదరని వైద్యులు నిర్ధారించారు. క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు.

*మృతుల కుటుంబాలకు తెల్లం పరామర్శ*

పిడుగుపాటుకు గురైన క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను టిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జితెల్లం వెంకట్రావు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: