CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

###కరోనాను కట్టడి చెయ్యడంలో ప్రతి వార్డుకు బ్లీచింగ్,హైపోక్లోరైడ్ చల్లినారు......###

Share it:


మన్యం టీవీ పాల్వంచ:-

23 వ వార్డు కూలి లైన్లో ఈ రోజు రెండో రోజు కూడా బ్లీచింగ్ డే నిర్వహించడం జరిగింది .వార్డులో ప్రతి గల్లీకి అన్ని బజారుల్లో బ్లీచింగ్ చల్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాస్ రెడ్డి, ఆర్. పి. మీరాబాయి నవీన్, మున్సిపల్ సిబ్బంది సంజయ్, కోమలి ,బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఇ మాట్లాడుతూ తూ మున్సిపాలిటీలో ప్రతి వార్డు లో గ్యాంగ్ వర్క్స్ ద్వారా కాలువలు పిచ్చి చెట్లు శుభ్రం చేయాలని ఐదు వార్డులో ఒక ట్రాక్టర్ ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ని హైపోక్లోరైడ్ ద్రావణం అన్ని వార్డుల్లో చల్లించాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అట్లాగే వార్డుల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతులు ,కుక్కలను పట్టించాలని చెప్పారు. మున్సిపాలిటీలో ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ప్రతిరోజు మంచినీళ్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలందరికీ ఫ్రీగా కార్పొరేట్ వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .కరోనా కష్టకాలంలో కరువు భత్యం కింద ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కోరారు. రేషన్ షాపుల ద్వారా తక్షణమే బియ్యం నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: