మన్యం టీవీ, ఏటూరి నాగరం ప్రతినిధి:
వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో 6.26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా మోటార్లు నడిచేలా నీరు నిల్వ ఉండాలన్నా.. సాగునీరు అందాలన్నా గోదావరి నదిపై చేపట్టిన సమ్మక్క బ్యారేజీ కీలకం.
తుపాకులగూడెం వద్ద గోదావరిలో నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుంది. దీంతో ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1.132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజ్ పనులు చేపట్టారు.
Post A Comment: