👉 ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో కాలుతున్న వీధి లైట్లు, మెయిన్స్
👉చింతిర్యాల కాలనీ ఉప సర్పంచ్ అశోక్ కుమార్
మన్యం మనగడ అశ్వాపురం
అశ్వాపురం మండలం చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీలో కరెంటు అధికారుల నిర్లక్ష్యంపై ఉపసర్పంచ్ అశోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొంతమంది మీటర్లు లేకుండా డైరెక్టుగా విద్యుత్ లైన్ కి వైర్లు తగిలించుకొని విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. అలా తగిలించుకోవడం వల్ల పంచాయతీ వీధి లైట్లు, మెయిన్స్ పదిహేను ఇరవై సార్లు కాలిపోవడం జరిగింది . తద్వారా పంచాయతీకి వేల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రతినెల రూ4000 వేల నుండి రూ. 5000 పంచాయతి నుండి సీసీ చార్జీలు చెల్లిస్తున్నాం అన్నారు. విద్యుత్ చౌర్యం పై పై జేఎల్ఎం అడిగితే మీరు పై అధికారులకు కంప్లైంట్ చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడన్నారు.
Post A Comment: