చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామపంచాయతీ ల్లో బుధవారం ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు మండల అధికారులు పాదయాత్ర నిర్వహించి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నాలుగో విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించామని. గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యలన్నిటిని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, విద్యుత్ సమస్యలు, పారిశుద్ధ్యం, డ్రింకింగ్ వాటర్, వైద్యం, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు, ఏడో విడత హరితహారం కార్యక్రమం, గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ లో బాగంగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అండ్ సబ్ రిజిస్టర్ ఏం ఉషా శారద, ఎంపీడీవో జి అన్నపూర్ణ ఎంపీవో తోట తులసీరామ్, ఆర్అండ్ బి ఏఈ లక్ష్మణ్, అర్ఐ ముత్తయ్య, ఏపీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం సంతోష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డ్ నెంబర్లు, కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: