పిల్లలకు అవగాహన కల్పించి మేమున్నాం అనే భరోసాకల్పించాలి-డి సి పి ఓ ఓంకార్.
మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ బారిన పడిన కుటుంబంలోని బాలల కు ఇప్పటి వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా 90 మందికి అందించినట్లు అందులో భాగంగా బుధవారం నాడు మంగపేట మండలంలోని రమణ క్కపేట గ్రామంలో కోవిడ్ బారిన పడిన బాలికకు కోవిడ్ విపత్తులో కోవిడ్ బారిన పడిన బాలికకు జిల్లా బాలల పరి రక్షణ విభాగం కింద చెక్కిస్ డ్రై ఫ్రూట్స్ నిత్యావసర సరుకుల బాల సహాయక కిట్ ను జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డిసిపిఓ) ఓంకార్ సీడీపీఓ హేమలత అందించారు. మండలంలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు సెక్టార్ సమావేశం నిర్వహించారు.గ్రామంలో కోవిడ్ బారిన పడిన బాలలను గుర్తించి వారికి చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ లో సంప్రదించే విదంగా చూసి కోవిడ్ బాల సహాయక కిట్ అందించే విదంగా చూడాలని పిల్లలకు మంచి చెడులు అనే విషయ లపై అవగాహన లేక పిల్లలు తప్పు దారి పడుతున్నారని పిల్లలకు మేము ఉన్నాము అనే భరోసాను అంగన్వాడీ టీచర్లు ఇవ్వాలని సమావేశంలో జిల్లా డీసీపీఓ ఓంకార్ అన్నారు.
Post A Comment: