CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా పేషెంట్లకు పండ్లు డ్రై ఫ్రూట్స్ పంపిణీ

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం,మాణిక్యరం 

 లో కరోనా ఉద్ధృతి కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులకు సిపిఎం సింగరేణి మండల కమిటీ,తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) ఆధ్వర్యంలో ఇమ్యూనిటీ శక్తి పెంచుటకు *పండ్లు - డ్రై ఫ్రూట్స్* పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సిపిఎం మండల కార్యదర్శి కే నరేంద్ర అధ్యక్షతన జరుగగా,టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి దుగ్గి కృష్ణ మాట్లాడుతూ కరోనా బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని,ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్ లో తగిన సౌకర్యాలు కల్పించాలని, నిత్యం డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలని, పోరాటాలు చేయడo వరకే కమ్యూనిస్టులు,ప్రజాసంఘాలు పరిమితం కావని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ముందు ఉంటాయని,కరోనా కాలంలో తమ ఆఫీసులను కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చిన ఘనత తమదని శ్లాఘించారు. అనేక మంది ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఆరోగ్యంగా బయటపడి అని తెలియజేశారు. భవిష్యత్తులోనూ పోరాటాలు సేవా కార్యక్రమాలు తో ముందుకు సాగుతామని వారు తెలిపారు. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని, సార్వత్రిక ఉచిత వ్యాక్సినేషన్ పూర్తి చేసి థర్డ్ వేవ్ నుంచి ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ పంపిణీ కార్యక్రమంలో లో టీఏజీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వజ్జా రామారావు,సిపిఎం జిల్లా నాయకులు కె నాగేశ్వర్ రావు, కోయ గుంపు శాఖ కార్యదర్శి పాయం ఎర్రయ్య,మాజీ సర్పంచ్ కరపటి సీతమ్మ, పాయం వరమ్మ,రైతు సంఘం నాయకులు కల్తీ రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: