👉దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలి.
👉జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.
మన్యం టీవీ కొత్తగూడెం జూన్ 26, శనివారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులందరూ న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను క్లుప్తంగా పరిశీలన చేశారు. జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిపై మరియు విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అవసరమైతే పీడీ యాక్టులను నమోదు చేయాలని సూచించారు.గంజాయి,గుట్కా,మట్కా లాంటి నిషేధిత వస్తువుల రవాణాకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. దొంగతనం కేసులలో నేరస్తులను పట్టుకొని చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్స్ బారినపడకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది విశేష సేవలందించారు. అదేవిధంగా శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూడా ప్రజలలో పోలీస్ శాఖ పై మరింత నమ్మకం పెరిగేలా బాధ్యతగా విధులను నిర్వర్తించాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్,మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్,భద్రాచలం ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్,ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్,కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు,డీసీఆర్బీ సిఐ రమేష్,ఎసిబి సిఐ బాలాజీ మరియు సిఐలు,ఎస్సైలు పాల్గోన్నారు.
Post A Comment: