టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు వేమూరి సత్యం చేతుల మీదుగా పంపిణీ
గుండాల (ఆళ్ల పల్లి) ( మన్యం టీవీ) కరోనా బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు మర్కోడు పంచాయతీ పరిధిలోని జిన్నెల గూడెం గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు కరోనా బారిన పడటంతో అదే గ్రామానికి చెందిన యువకులు నిత్యవసర వస్తువులను టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు వేమూరి సత్యం చేతుల మీదుగా బాధితులకు పంపిణీ చేశారు. 15 కేజీల బియ్యం చికెన్ కోడిగుడ్లు కూరగాయలు అందజేశారు. అనంతరం వేమూరి సత్యం మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారిని ఆదుకోవాలని కోరారు. కరోనా నిర్ధారణ అయిన తర్వాత నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని స్తోమత ఉన్నవారు పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోజిన్నెల గూడెం యువకులు పాల్గొన్నారు
Post A Comment: