CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధిలో మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలి-జెడ్పిటిసి కామారెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం.. ముసలమడుగు,కృష్ణసాగర్, ఇరవెండి,మోతె పట్టినగర్ గ్రామ పంచాయతీలలోని పల్లె ప్రకృతి వనాలను,వైకుంఠ ధామాలను, డంపింగ్ షెడ్డులను,నర్సరీలను సందర్చించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,ఎంపీడీఓ వివేక్ రామ్,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.


అనంతరం జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో వీధి వీధి తిరుగుతూ డ్రైనేజీలలోని పేరుకుపోయిన పూడిక మట్టిని తీయించి శుభ్రం చేయించాలని, బ్లీచింగ్ చల్లించి,హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్లను,సెక్రటరీలను కోరారు.అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీల్లో ఆయా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయటంతో పాటు అత్యంత సుందరంగా తీర్చిదిద్ది బూర్గంపాడు మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ లు కుర్సం వెంకటరమణ,కోడిమె వెంకటేశ్వర్లు,కొర్సా లక్ష్మీ, పోతునూరి సూరమ్మ, స్థానిక ఉపసర్పంచ్లు సొందే గోవింద్, స్థానిక వార్డుసభ్యులు, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,స్థానిక పంచాయతీ సెక్రటరీలు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు బట్ట వెంకన్న,స్థానిక టిఆర్ఎస్ నాయకులు పోడియం నరేందర్,కుర్సం వెంకన్న, ఏపీవో శ్రీలక్ష్మి,ఏఈ ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: