CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన గ్రామాలలో నిత్యవసర సరుకులు వితరణ

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం: భద్రాద్రి కోత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన గ్రామాలు అయిన గోందిగూడెం, గుళ్ళమడుగు,గోందిగూడెం కోత్తూరు,బీమవరం,తుమ్మల చేరువు గ్రామాల్లో 60 కుటుంబాలకు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులకు సొంత బంధువులే దగ్గరకు రాలేని నటువంటిపరిస్థితిలో కూడా మేమున్నామని నీకేం కాదని కొండంత అండగా ఉంటూ ఎంతో ధైర్య సాహసంతో భౌతిక దూరం పాటిస్తూ కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి సలహాలు సూచనలు ఇస్తూ నిత్యవసర సరుకులు ,మాస్కులు, శానిటైజర్ ,సబ్బులు వితరణ చేశారు. గోందిగూడెం,తుమ్మల చేరువు,గోందిగూడెం కోత్తురు పంచాయతీ లలో 1000 కూరగాయల విత్తనాల ప్యాకేట్స్ పంచాయతీ లలో ప్రతి కుంటుంబానీకి అందించాలనీ గ్రామ సర్పంచ్ కీ అందజేయ్యడం జరిగింది. అలాగే గుళ్ళ మడుగు, పాలవాగు గ్రామ లలో 60 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోందిగూడెం సర్పంచ్ పాయం భద్రమ్మ,గోందిగూడెం కోత్తూరు సర్పంచ్ శర్ప సూరిబాబు ,తుమ్మల చెరువు సర్పంచ్ బండ్ల సంధ్యా రాణిగారు,తుమ్మల చెరువు యంపిటిసి తాటి పూజిత ,సెక్రటరీ ఉపెంద్ర, జిల్లా సంఘటన మంత్రి కోరం. సూర్యనారాయణ, అశ్వాపురం మండల ప్రముఖ కోరెం రామారావు , నిలయ ప్రముఖ్ గొంది .శోభన్ బాబు,మహిళ ప్రముఖ తాటి చిట్టి ,తాటి వెంకటేశ్వర్లు, పాయం సర్వేశరరావు, సేవా భారతి అంబులెన్స్ డ్రైవర్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: