మన్యం టీవీ, అశ్వాపురం:ప్రభుత్వం సూచించిన కోవిడ్ లాక్డౌన్ మార్గదర్శకాలను పాటించినందుకు పోలీసులకు సహకరించినందుకు అశ్వాపురం మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన అశ్వాపురం సీ ఐ సట్ల రాజు.
లాక్డౌన్ ఎత్తివేయబడినప్పటికీ, ప్రతి ఒక్కరూ ఐదు ప్రాథమిక సూత్రాలను పాటించాలని అన్నారు.
*1. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
*2. రద్దీ ప్రదేశాల్లో సామజిక దూరం పాటించాలి.
*3. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.
*4. సభలు,సమావేశాలకు దూరంగా ఉండాలి.
*5. చేతులను సబ్బుతో పాటు తరచూ శానిటైజర్ చేసుకోవాలని సూచించారు.
ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకునే వరకు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సిఐ సట్ల రాజు పేర్కొన్నారు.
Post A Comment: