స్వీయనియమ నిబంధనలే శ్రీరామ రక్ష
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల కేంద్రం లో మండల తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ మాట్లాడుతూ దేశం మొత్తం కోవిడ్ నేపథ్యంలో అభివృద్ధి స్థంభించిపోయినది. తెలంగాణ రాష్ట్రం యావత్తు ఒక పక్క కోవిడ్ తో యుద్ధం చేస్తూ మరొక పక్క రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంది. తెలంగాణా రాష్ట్రంలోని డాక్టర్స్, నర్స్లు, అంగన్వాడీ, పారిశుధ్య కార్మికులు, పోలీస్లు, రెవిన్యూ డిపార్ట్మెంట్, గ్రామపంచాయతీలు ఇలా ఒక్కరు కాదు తెలంగాణా యావత్తు రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పగలనక రాత్రనక కరోనాతో ముందుండి పోరాటం చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికీతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరోనా రహిత సమాజంలో జరుపుకోవాలని, ఇప్పుడు మాత్రం ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి ఆరోగ్యాకరమైన తెలంగాణను మరల పొందాలి అంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియమ నిబంధనలతోపాటు ప్రభుత్వం విధించిన ఆదేశాలు పాటించాలి అంటూ ఈ సందర్బంగా తెలియజేసారు.
Post A Comment: