మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని సోమవారం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడిగా సోదరుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించడం సంతోషకరమని గత మేడారం జాతరలో వనదేవతలకు మొక్కిన మొక్కు తీరిందని రేవంత్ రెడ్డికి శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి, అని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా మనమందరం కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలపు అనంత రెడ్డి, మాజీ జెడ్పిటిసి బోల్లు దేవేందర్, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, జిల్లా నాయకులు అర్రెం లచు పటేల్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పీరీల వెంకన్న యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు పూర్ణ, మాజీ ఎంపిటిసి బత్తిని రాజు, సహకార సంఘం డైరెక్టర్ సిద్ది రెడ్డి,మాజీ ఎంపీటీసీ సరిత రాజు, ఉపసర్పంచ్, మండల మహిళ ప్రధాన కార్యదర్శి బడే లలిత, మాధరి నారాయణ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: