CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం నియోజకవర్గం లోని పోడు సమస్యలు పరిష్కరించాలి

Share it:

 


👉భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

మన్యం మనుగడ, భద్రాచలం టౌన్: భద్రాచలం నియోజకవర్గం లో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పోడు సాగుదారుల పై వేధింపులు మానుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. ఆయన మంగళవారం

ములుగు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నియోజకవర్గం లోని పోడు భూముల రైతుల గురించి ఏన్ని పర్యాయాలు అసెంబ్లీ సాక్షిగా విన్నవించుకున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల పట్ల గిరిజన ప్రాంతాల పట్ల ఎటువంటి బాధ్యత చూపట్లేదని అన్నారు.గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  గిరిజనుల సమస్యలను పోడు భూముల సమస్యల పరిష్కారానికి  ముఖ్యమంత్రి తో మాట్లాడి గిరిజనులకు ఇకనైనా న్యాయం జరిగే విధంగా గా చూడాలని కోరారు.. ఏజెన్సీ ప్రాంతాలలో ఎంతో మంది గిరిజనులు చదువుకొని విద్యావంతులై నిరుద్యోగులుగా నానా ఇబ్బందులు పడుతున్నారని వారికోసం ప్రత్యేకంగా గిరిజన ఉద్యోగాల డ్రైవ్ ఒకటి ఏజెన్సీ ప్రాంతంలో అత్యవసరంగా పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఏజెన్సీ ప్రాంతాలకు కేటాయించకుండా వివిధ శాఖలకు మళ్లించి తెలంగాణ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచి పరిణామం కాదని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: