CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యాలి

Share it:

 


👉సిపిఐ (ఎం) పార్టీ నాయకుల డిమాండ్

మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, జానకిపురం(ఊటుపల్లి) గ్రామంలో సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో, మండల జనరల్ బాడీ విస్తృత సమావేశం నిర్వహించారు. నూనె కోటయ్య అధ్యక్షత వహించిన, ఈ సమావేశంలో కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ, వర్షపు నీటితో నేలతల్లి పులకరించిన సమయాన, రైతులందరూ వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారని. వ్యవసాయ కూలీలు,రైతులు, సామూహికంగా వ్యవసాయ పనులు నిర్వహించే క్రమంలో, కరోనా వైరస్ ఉదృతం అయ్యే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం. దేశానికి వెన్నెముక అయిన రైతుల క్షేమం కోసం,తక్షణమే స్పందించి. రైతులు, వ్యవసాయ కూలీలు అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని. రైతులకు వ్యయ ప్రయాసలతో కూడిన ఇబ్బందులు తలెత్తకుండా, వైద్య ఆరోగ్య సబ్ సెంటర్ల వద్ద కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి-జంగిలి వెంకటరత్నం, సిపిఎం పార్టీ నాయకులు లింగబోయిన వెంకన్న, ఆర్ నాగేశ్వరరావు, కే కృష్ణ , బాబురావు సుధాకర్, రమేష్, మమత, సక్కుబాయి, సామ్రాజ్యం, లక్ష్మీకాంతం, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: