మన్యం మనగడ, పినపాక: పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను అందించి ప్రాణదాతగా,కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కర్మ ల కోసం అన్నదాత గా మారుతున్నారు. తాజాగా గురువారం నాడు జగ్గారం గ్రామంలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన కుటుంబానికి దశదినకర్మ నిమిత్తం యాభై కేజీల బియ్యాన్ని వితరణగా అందజేయడం జరిగింది. కంది సుబ్బారెడ్డి చేస్తున్న సేవ పట్ల, మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు సేవలను కొనియాడుతూ "అన్నదాత" సుఖీభవ అని అంటున్నారు
Navigation
Post A Comment: