గుండాల (ఆళ్ల పల్లి) (మన్యం టీవీ) ఉపాధి హామీ కార్మికులకు మర్కోడు గ్రామానికి చెం దిన అంజోజు ప్రవీణ్ మాస్కులు పంపిణీ చేశాడు .ఈ పంపిణీ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు వేమూరి సత్యం తో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు. మండలంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా నుండి రక్షణ కొరకు మాస్కులు కీలక భూమిక పోషిస్తున్నాయి. మాస్కులు తప్పకుండా ధరించాలని వేమూరి సత్యం ప్రజలను విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు .ఈ కార్యక్రమంలో కంచర్ల రవి, ఇనుముల సమ్మయ్య , సుధాకర్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: