మన్యంటీవీ, అశ్వారావుపేట:
ప్రతీ గ్రామంలో మొక్కలను నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించడం సామాజిక బాధ్యత అని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలపడంతో, ప్రభుత్వం ఏడో విడత హరితహారానికి సమా యత్తం అవుతున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటి నుంచే కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. సోమవారం అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో సర్పంచ్ సున్నం సరస్వతి, జూజ్జురి రాంబాబు, పంచాయతీ సెక్రటరీ రమేష్ నాయక్ శృతితో తిరుమలకుంట కాలనీ నుండి తిరుమలకుంట వరకు రోడ్డుకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో 400 మొక్కలు ఉపాధి హామీ కూలీలతో మొక్కలు నాటించారు. సర్పంచ్ సున్నం సరస్వతి మాట్లాడుతూ రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టాలని సర్పంచ్ సున్నం సరస్వతి అన్నారు. ప్రతీ మొక్క వృక్షంగా ఎదిగే వరకు కాపాడే బాధ్యత గ్రామస్థులదేనని, వారి సహకారంతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సున్నం రామలక్మయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: