✍️ ఎమ్మెల్యే వనమా సూచన మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీలను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
✍️ తన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసిన : ఎమ్మెల్యే వనమా
మన్యం టీవీ పాల్వంచ :-
ఈరోజు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే వనమా సూచన మేరకు కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూక్యా రాంబాబు ను, వైస్ చైర్మన్ గా వజ్జా రాజును మరియు కమిటీ సభ్యులు ను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులకు తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే శ వనమా వెంకటేశ్వరరావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రాంబాబుకు, వైస్ చైర్మన్ వజ్జా.రాజుకు మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, కెసిఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని, నియోజకవర్గం లోని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, రైతులకు సేవ చేయడం ఒక యజ్ఞంలా స్వీకరించాలని, రైతుల విషయంలో అలసత్వం వహించోదని అన్నారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే వనమా* ను పూల మాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి న నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భుక్యా రాంబాబు, వైస్ చైర్మన్ వజ్జ రాజు మరియు కమిటీ సభ్యులు.
Post A Comment: