మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలంలో,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయం లో ప్రజలపై పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్,నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో పెట్రోల్,డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలను పెంచడం వల్ల, మధ్య తరగతి ప్రజలపై చాలా భారం పడుతుందన్నారు.వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: